Top 5 This Week

Related Posts

ఖమ్మం ‘రియల్టర్’ ఐపీ

ఖమ్మం: రియల్ ఎస్టేట్, లిక్కర్ తదితర వ్యాపారాలు నిర్వహించే కొండపల్లి గణేష్ దివాళా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశాడు. తనకు అప్పులిచ్చిన మొత్తం 95 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ, రూ. 33 కోట్ల 5 లక్షల, 95 వేల రూపాయలకు గణేష్ ఐపీ దాఖలు చేశాడు. ఈమేరకు ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో గణేష్ తన లాయర్ ద్వారా దివాళా పిటిషన్ దాఖలు చేశాడు.

తాను 2020 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నానని, ‘గణేష్ రియల్ ఎస్టేట్స్’ పేరుతో ఖమ్మం బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు సాగించినట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో ‘గణేష్ గ్రాండ్’ పేరుతో హోటల్ వ్యాపారంలోకి ప్రవేశించానని, ఘట్ కేసర్ మండలం చౌదరిగూడలో ‘తాజా ఫుడ్స్’ పేరుతో మరో హోటల్ ప్రారంభించినట్లు తన పిటిషన్ లో పేర్కొన్నాడు.

అంతేగాక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించానని, లిక్కర్ వ్యాపారంలో ప్రవేశించాలనే ఉద్ధేశంతో పలు ప్రాంతాల్లో టెండర్లు దాఖలు చేసినట్లు గణేష్ పేర్కొన్నాడు. అయితే వ్యాపార నిర్వహణ కోసం రుణదాతల నుంచి అధిక మొత్తంలో అప్పులు చేశానని, తీవ్ర నష్టాలు రావడంతో అప్పులిచ్చినవారి బాకీలు తీర్చలేని పరిస్థితి ఏర్పడిందన్నాడు. అందువల్ల తనను దివాళాదారునిగా ప్రకటించాలని కోరుతూ కొండపల్లి గణేష్ ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Popular Articles