హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదివారం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో నిందితునిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సీపీకి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావును కొండాపూర్ లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా విచారణకు పిలిచినప్పటికీ తప్పించుకుంటూ హైదరాబాద్లోని కొండాపూర్లో బస చేస్తున్న నాగేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు చెప్పాయి.
ఏపీలో లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు, నగదు లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్కెసిరెడ్డి ఉన్నారు.

