సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాలకవర్గం లేని సమయంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు, అవినీతి జరిగిందనే ఫిర్యాదులపై ఏసీబీ ఖమ్మం డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ రికార్డులను, చేపట్టిన పనులను అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావలసి ఉంది.
సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏసీబీ తనిఖీలు

