Top 5 This Week

Related Posts

ACB Raids: జలమండలిలో ‘రూ. 100 కోట్ల’ తిమింగలం!

హైదరాబాద్: హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని జలమండలి జనరల్ మేనేజర్ సగ్గం అనంతలక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గల అతని బంధువులకు చెందిన మొత్తం ఎనిమిది ఇండ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగాలపై కుమార్ నివాసంలో నిర్వహిస్తున్న సోదాల్లో బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం రూ. 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

సోదాల్లో హైదరాబాద్ మల్లాపూర్ లోని కుమార్ నివాసంలో రూ. 1.10 కోట్ల నగదును, కిలోకుపైగా బంగారు నగలను, రెండున్నర కిలోల వరకు వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ లో 3.00 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో ఆరు ఓపెన్ ప్లాట్లు, మూడు గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లను గుర్తించి, వాటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని తెరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Popular Articles