Top 5 This Week

Related Posts

‘చట్టబద్ద పాలన గెలవాలి.. వ్యక్తుల పాలన కాదు’: హైడ్రాపై హైకోర్టు ఉత్తర్వులో కీలక వ్యాఖ్యలు

‘చట్టబద్ధమైన పాలన గెలవాలి, వ్యక్తుల పాలన కాదు..
వ్యక్తుల పాలన గెలిస్తే, అది ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుంది..
ఇది చట్టబద్ధమైన పాలనపై వ్యక్తుల పాలన పైచేయి సాధించేందుకు ప్రయత్నించిన ఒక చక్కటి ఉదాహరణ..’

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ అనంతరం తెలంగాణా హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలివి..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ పోస్టు నుంచి తప్పించాలని, అతని స్థానంలో మరొకరిని నియమించాలని హైకోర్టు ఈనెల 27వ తేదీన ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈమేరకు తీర్పు కాపీని హైకోర్టు వెలువరించింది. హైడ్రా వ్యవహార తీరుపై హైకోర్టు తన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని ఆదేశించింది. మరో అధికారిని నియమించాలని సీఎస్‌కు సూచించింది.

Popular Articles