ఖమ్మం: పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పలువురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మున్సిపాలిటీలోని 32 వార్డులకుగాను, 18 వార్డుల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు ఆఫీస్ ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ప్రకటించారు. రిజర్వేషన్లకు అనుగుణంగా వార్డుల వారీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన వారి వివరాలు:
- 2వ వార్డు: ఏనుగు స్వరూప
- 3వ వార్డు: వెలుగు సైదమ్మ
- 5వ వార్డు: బానోత్ నాగేంద్ర ప్రసాద్
- 6వ వార్డు: వేమిరెడ్డి శ్రీదేవి
- 7వ వార్డు: బుర్రా మహేష్
- 8వ వార్డు: సంగని సుశీల
- 9వ వార్డు: కందుకూరి శేషమ్మ
- 11వ వార్డు: పేరం వెంకటలక్ష్మ
- 12వ వార్డు: చప్పిడి గోవిందరావు
- 14వ వార్డు: తమ్మినేని నవీన్
- 15వ వార్డు: తమ్మినేని మంగతాయి
- 16వ వార్డు: ఇనప రాంబాబు
- 17వ వార్డు: గొడ్డుగొర్ల క్రిష్ణకుమారి
- 19వ వార్డు: మాలాది శిరీష
- 23వ వార్డు: పోకబత్తిని అనిత
- 24వ వార్డు: బానోత్ భాస్కర్
- 26వ వార్డు: బానోత్ దివ్య
- 27వ వార్డు: భూక్యా ఫూల్ చంద్ నాయక్


