Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

TSPSC ఛైర్మెన్ గా జనార్ధన్ రెడ్డి

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్, సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనలను మేరకు గవర్నర్ తమిళిసై ఆమోదించారు. సంస్థ చైర్మన్ గా డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు), సభ్యులుగా రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ), ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పీహెచ్డీ, ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి), కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ బీఈడీ, ఎంఏ ఎల్ ఎల్ బీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్), సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఏ తెలుగు, తెలుగు పండిట్ ), కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి), ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి ఎ ఎంఎస్ (ఉస్మానియా), ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్) ఆర్. సత్యనారాయణ (బిఎ, జర్నలిస్ట్)లను సీఎం కేసీఆర్ నియమించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Popular Articles