హైదరాబాద్: తెలంగాణా నూతన చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్ లోని సీఎస్ కార్యాలయంలో సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన రామకృష్ణారావు పదవీ విరమణ చేశారు. ఛార్జి తీసుకున్న తర్వాత సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.


