హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పది మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 24 మంది పంచాయత్ రాజ్ శాఖ అధికారులు బదిలీ అయ్యారు. వారిలో పలువురిని జిల్లా పరిషత్ లకు కొత్త సీఈవోలుగా నియమిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. డిప్యూటీ సీఈవోలకు అడహాక్ పదోన్నతులు కల్పిస్తూ జెడ్పీలకు సీఈవోలుగా, ఇతర విభాగాల అధికారులుగా నియమించడం గమనార్హం. అదేవిధంగా పది మంది స్పెషల్ గ్రేడ్, డిప్యూటీ కలెక్టర్లను కూడా బదిలీ చేస్తూ, పోస్టింగులు కల్పిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.
పదోన్నతులు, బదిలీలు, పోస్టుంగులు పొందిన ఆయా అధికారుల వివరాలను దిగువన గల ఉత్తర్వు పీడీఎఫ్ ప్రతుల్లో చూడవచ్చు


