తెలంగాణాలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించిన ‘తెలంగాణా రాజ్యాధికార పార్టీ’ (టీఆర్పీ) హోటల్ తాజ్ కృష్ణలో పురుడు పోసుకుంది. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న తన పార్టీ పేరును ప్రకటించారు. తెలంగాణాలో మెజారిటీ సంఖ్యలో గల బీసీలకు రాజకీయ పార్టీ ఆవశ్యకతను గుర్తించి పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


