Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ముగ్గురు ‘ఐపీఎస్’ల సస్పెన్షన్

ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ వేటు పడిన ఐపీఎస్ అధికారుల్లో పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ ఉన్నారు. ముంబయి నటి వ్యవహారం, ఇతరత్రా ఆరోపణలపై ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

ముంబయి నటి కాదంబరి జత్వానీ అరెస్టు అంశంలో కీలక పాత్ర పోషించినట్లు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆరోపణలు ఎదుర్కున్నారు. మొత్తం ఉదంతంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. దీంతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు విచారణ నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతారాణా టాటా, ఐపీఎస్ విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Popular Articles