Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కరోనా టెస్ట్ చేయించుకున్న మంత్రి అజయ్

తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతి వారానికో, పదిహేను రోజులకోసారో ఆయన కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారని అజయ్ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

తన సిబ్బందిలో ఒకరిద్దరికి కరోనా సోకితే మొత్తం టీంకు కరోనా పరీక్షలు చేయించారని, తనతో కలిసిన నాయకులకు, అధికారులకు కరోనా వచ్చిన ప్రతి సందర్భంలోనూ మంత్రి అజయ్ టెస్ట్ చేయించుకోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన వర్గీయులు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మంత్రి అజయ్ తాజాగా ఈనెల 11న కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. పరీక్షకు సంబంధించిన నివేదికను కూడా అజయ్ వర్గీయులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం గమనార్హం.

Popular Articles