Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

దుబ్బాకలో బీజేపీ సవాల్!

దుబ్బాక ఉప ఎన్నిక పలితాల్లో బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి సవాల్ విసురుతోంది. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు 1,259 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిపై తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుండడం విశేషం. ఓట్ల లెక్కింపు ఫలితాల్లో ఇదే సరళి కొనసాగితే దుబ్బాకలో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి షాక్ ఇచ్చినట్లే అవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Popular Articles