Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

కిడ్నాపైన ఎస్ఐ దారుణ హత్య

కిడ్నాప్ చేసిన ఎస్ఐని మావోయిస్టు నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్ గఢ్ లోని గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్సమ్ మెర్క్యురీలో అతని మృతదేహాన్ని విసిరేశారు. ఈనెల 21వ తేదీన ఎస్ఐ మురళి తాతిని మావోయిస్టు నక్సలైట్లు ఛత్తీస్ గఢ్ లో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తన సొంత గ్రామానికి వెళ్లిన ఎస్ఐ మురళి తాతిని నక్సలైట్లు అనూహ్యంగా కిడ్నాప్ చేశారు. అతని విడుదల కోసం మధ్యవర్తుల ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలోనే నక్సలైట్లు ఈ ఘాతుక చర్యకు పాల్పడ్డారు. ఎస్ఐ మురళిని తాము ప్రజాకోర్టులో శిక్షించినట్లు నక్సలైట్లు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. కాగా కిడ్నాపైన ఎస్ఐ మురళిని నక్సలైట్లు హత్య చేసిన ఘటనను ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు.

నక్సలైట్లు హత్య చేసిన ఎస్ఐ మురళి మృతదేహం

Popular Articles