మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందాడనే వార్తలపై ఆ పార్టీ స్పష్టతనిచ్చింది. తమ నాయకుడు దామోదర్ క్షేమంగా ఉన్నట్లు మావోయిస్ట్ పార్టీ దక్షణ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి సమత పేరుతో హిందీ ప్రకటన వెలువడింది. పూజరి కాంకేర్ అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో దామోదర్ చనిపోలేదని, ఆయన క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు. దామోదర్ మరణించినట్లు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పోలీసులు తమ పార్టీ పేరును ఉపయోగించారని సమత ఆరోపించారు.


