Top 5 This Week

Related Posts

తెలంగాణాలో తాజా కరోనా కేసుల సంఖ్య ఎంతో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పేషెంట్ల సంఖ్య అరవై వేలు దాటింది. బుధవారం నమోదైన గణాంక వివరాల ప్రకారం బాధితుల సంఖ్య 60,717కు చేరినట్లు వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. అంతేగాక బుధవారం కొత్తగా 1,811 కరోనా కేసులు నమోదనట్లు కూడా ఆయా శాఖ వివరించింది. కరోనా వైరస్ వల్ల నిన్న ఒక్కరోజే 13 మంది మృతి చెందగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 505కు చేరింది. కరోనా నుంచి కోలుకుని బుధవారం 821 మంది డిశ్ఛార్జి కాగా, మొత్తం ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 44,572కు పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 18,263 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు విడుదల చేసిన కరోనా సమాచార నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 4,16,202 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు.

Popular Articles