Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

రాధిక దంపతులకు జైలు శిక్ష

ప్రముఖ సినీ జంట రాధిక, శరత్ కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో వీరిద్దరికీ ఈ శిక్ష విధిస్తూ చెన్నయ్ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. రేడియన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి భారీ మొత్తంలో రాధిక, శరత్ కుమార్ దంపతులు రుణంగా తీసుకున్నారు. అయితే దీన్ని తిరిగి చెల్లించే విషయంలో 2017 సంవత్సంలో రేడియన్ సంస్థకు చెక్ ఇవ్వగా, సరైన నగదు నిల్వ లేని కారణంగా చెక్ బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో రేడియన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేసు పూర్వపరాలను విచారించిన చెన్నయ్ స్పెషల్ కోర్టు రాధిక, శరత్ కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Popular Articles