Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

‘పెట్రోలియం’ స్టాండింగ్ కమిటీలో మళ్లీ వద్దిరాజు

పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యునిగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకుమరోసారి ఛాన్స్ లభించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకపు ప్రక్రియలో భాగంగా వద్దిరాజు రవిచంద్రను మరోసారి పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ మేరకు లోక్ సభ డిప్యూటీ సెక్రటరీ సుజయ్ కుమార్ శుక్రవారం నియామాకపు ఉత్తర్వును జారీ చేశారు.

మొత్తం 31 మంది సభ్యులు గల ఈ కమిటీలో లోక్ సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి నియామాకమయ్యే ఈ కమిటీకి రవిచంద్ర వరుసగా మూడోసారి సభ్యుడిగా ఎంపిక కావడం విశేషం. కాగా ఈ దఫా పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా పార్లమెంట్ సభ్యుడు సునీల్ దత్తాత్రేయ తట్కరే కొత్తగా ఎన్నికయ్యారు.

Popular Articles