Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

హైదరాబాద్ కు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ కు వస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఆయన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చార్మినార్‌ వద్దకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడగల భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సుమారు అరగంట సేపు ఆయన ఆలయం వద్దే ఉంటారని సమాచారం. అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వారాసిగూడలో అమిత్ షా రోడ్‌ షో నిర్వహిస్తారు. అమిత్ షా వెంట యోగి ఆదిత్యనాధ్ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

Popular Articles