Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

వీహెచ్ కు రేవంత్ పరామర్శ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావును పీసీసీ అధ్యక్షునిగా నియమితుడైన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోమవారం పరామర్శించారు. అనారోగ్యంతో వి. హనుమంతరావు హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి సోమవారం వీహెచ్ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వీహెచ్ త్వరగా కోలుకోవాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. తనను పరామర్శించడానికి వచ్చిన కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హన్మంతరావు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

Popular Articles