Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

కరోనాపై ఢిల్లీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్ కు సంబంధించి ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో, ఢిల్లీలో సెకండ్ వేవ్ దాటి థర్డ్ వేవ్ లోకి కరోనా ప్రవేశించిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ లో ఉందని కూడా చెప్పారు.

ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ ఈనెలలోనే ప్రారంభమైందని, ప్రజలందరూ మాస్కులు ధరించి ఉండాలన్నారు. ప్రజలు తమను తాము కాపాడుకుంటూ ఇతరులను కాపాడాలని కోరుతూ, తాజా స్థితిపై మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచన లేదన్నారు. ఢిల్లీలో తాజాగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న పరిణామాల్లో మంత్రి సత్యేంద్రజైన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Popular Articles