Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మంత్రి అజయ్ అభ్యర్థన… చిందేస్తున్న ‘సాగర్’ రైతు!

ఔను… నాగార్జున సాగర్ ఆయకట్టు రైతు చిందేస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు కింద సాగయ్యే పంటలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాలను విడుదల చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థన మేరకు జిల్లాలోని రైతులకు సరిపడా నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఖమ్మం జిల్లాలోని రైతుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ఆయా పోస్టులో ఓ రైతు పొలంలో పార చేబూని సంతోషంతో డాన్సు చేస్తుండడం విశేషం. రైతుల సంతోషానికి సంబంధించిన మరో రెండు ఫొటోలను కూడా మంత్రి అధికారిక వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. రైతు చిందేస్తున్న దృశ్యానికి సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ ట్వీట్ ను దిగువన చూసేయండి.

Popular Articles