Sunday, January 25, 2026

Top 5 This Week

Related Posts

కీలక అంశాలపై సమీక్ష

తెలంగాణా సీఎం కేసీఆర్ నేడు పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష జరుపుతారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ నిర్వహిస్తారు.

అంతేగాక యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై కూడా ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ అధికారులు, దేవాలయ ఈవో తదితరులు ఆయా సమీక్ష, సమావేశాల్లో పాల్గొంటారు. శనివారం జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.

Popular Articles