Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణా సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి లేఖలు ఇచ్చారు. ప్రధాని ముందు సీఎం కేసీఆర్ ఉంచిన పలు అంశాల వివరాలు ఇవీ:

• ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలి
• రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి.
• హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలి.
• కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
• ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలి.
• మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
• ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలి.
• కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలి.
• హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.
• రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.
• వరంగల్ టెక్స్ టైల్ పార్క్ రూ. వెయ్యి కోట్ల గ్రాంటు ఇవ్వాలి.

Popular Articles