Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ కు ఊరట

ఢిల్లీ: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని బీజేపీ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. గతంలో ఇదే అంశంపై బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణా హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పిటిషన్ ను డిస్మిస్ చేశారు. రాజకీయ పరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. రాజకీయ నేతలకు సున్నిత మనసు ఉండరాదని, కోర్టులను రాజకీయ యద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని కూడా సీజేఐ ధర్మాసనం హితవు చెప్పింది.

Popular Articles