హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఈ కేసును దర్యాప్తు చేస్తన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నుంచి పిలుపు వచ్చింది. ఈ కేసులో విచారించేందుకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు హరీష్ రావుకు నోటీసు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని హరీష్ రావుకు సిట్ అధికారులు సూచించారు.

