రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విదేశీ పర్యటనకు వెడుతున్నారు. ఈనెల 21వ తేదీ సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఆయన అమెరికా వెళ్లనున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు మంత్రి పొంగులేటి విదేశీ పర్యటనలో ఉంటారని సమాచారం. తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెడుతున్నట్లు తెలిసింది.

