Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

రాజ్యసభకు పొంగులేటి ఖరారు!

తెలంగాణా రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు ఖరారైనట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ వీరిరువురికీ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఇక లాంఛనంగా ప్రకటించడమే తరువాయి.

మరోవైపు రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న రెండు శాసన మండలి స్థానాలకు సైతం పేర్లను కేసీఆర్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్‌ను, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నలుగురి పేర్లను కేసీఆర్ ఒకేసారి ప్రకటించనున్నారు.

Popular Articles