Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కరోనా మందుపై ‘మైలాన్’ కీలక ప్రకటన

‘డెస్రెం’ పేరుతో కరోనా మందును విడుదల చేస్తున్నట్లు దేశీయ ఫార్మా కంపెనీ మైలాన్ ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్డెసివిర్ కు తమ జనరిక్ వెర్షన్ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. గిలియడ్ సైన్సెస్ కు చెందిన యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ జనరిక్ వెర్షన్ డ్రగ్ 100 మిల్లీ గ్రాముల డోసు ఉంటుందని, దీని ధర రూ. 4,800 గా సంస్థ ప్రకటించింది. ‘డెస్రెం’ అనే ఔషధ పేరుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా సంస్థ అనుమతి లభించినట్లు కూడా మైలాన్ సంస్థ వెల్లడించింది.

Popular Articles