Top 5 This Week

Related Posts

గుంటు మల్లేశ్వరస్వామి సేవలో ఎంపీ వద్దిరాజు దంపతులు

మహా శివరాత్రి సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు ఖమ్మం కాల్వొడ్డులో గల గుంటు మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఎంపీ రవిచంద్ర-విజయలక్మి దంపతులు బుధవారం తెల్లవారుజామున గుంటు మల్లేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ కమిటీ ప్రముఖులు ఎంపీ రవిచంద్రను శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ఎంపీ వద్దిరాజు దంపతులతోపాటు యూత్ లీడర్స్ సుంకర చిరంజీవి, ఆకుల సాయి, మద్దెల భానుప్రతాప్ తదితరులు గుంటు మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ఎంపీ వద్దిరాజు, విజయలక్ష్మి దంపతులను సత్కరిస్తున్న ఆలయ ధర్మకర్తలు

Popular Articles