Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్: ఎంపీ వద్దిరాజు కీలక పిలుపు

బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తెలంగాణా భవన్ కు తరలిరావలసిందిగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. పార్టీ యువనేత కేటీఆర్ కు మద్ధతు పలకాలని గులాబీ కేడర్ ను కోరారు. ఈమేరకు రవిచంద్ర ఓ ప్రకటకన విడుదల చేశారు. విచారణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వేధించడానికి చేసే కుట్రలను విచ్ఛిన్నం చేస్తూ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ కు హాజరవుతున్న కేటీఆర్ కు మద్దతు పలుకుదామని వద్దిరాజు పిలుపునిచ్చారు. ఈనెల 16వ తేదీన సోమవారం ఉదయం 9:00 గంటలకు బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు చేరుకోవాలని కోరారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ వరకు ప్రదర్శనగా వెళ్లి కేటీఆర్ కు మద్దతు పలుకుదామని ఎంపీ వద్దిరాజు పార్టీ నాయకులను కోరారు.

Popular Articles