Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కరోనాతో ఎమ్మెల్సీ మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గత నెల 13న కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే నేడు తుదిశ్వాస విడిచారు. గతంలో ఎమ్మెల్యేగానూ ఎన్నికైన రామకృష్ణారెడ్డి ఆరు నెలల క్రితమే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు ఇద్దరు చొప్పున కుమారులు, కుమార్తెలు ఉన్నారు.

Popular Articles