Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

మంత్రి ‘పొంగులేటి’ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆదివారం టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకల ప్రభుత్వ ఉద్యోగుల వన సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి ఇదే సందర్భంగా చేసిన ‘పింక్ కలర్ మైకం’ వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారి తీశాయి. ఇంకా కొద్దిమంది పింక్ కలర్ మైకంలోనే ఉన్నట్లు కనిపిస్తోందని, ఇంకా రెచ్చగొడుతున్నారని, ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యల పరంపరలో ఆ తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని తనదైన శైలిలో కొనసాగించడం గమనార్హం. మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల గురించేనా? అనే ప్రశ్న రేకెత్తుతోంది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను దిగువన గల ఈ వీడియోలోనూ చూడవచ్చు..

Popular Articles