Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

“పొలిటికల్ బాంబ్” పేల్చిన పొంగులేటి

  • ఒక‌టి రెండు రోజుల్లో పేలనున్న పొలిటిక‌ల్ బాంబులు
  • ప్ర‌ధాన నాయ‌కుల‌పైన చ‌ర్య‌లు త‌ప్ప‌వు
  • ఆధారాల‌తో సిద్ద‌మైన ఫైళ్లు
  • జాతీయ తెలుగు ఛానెల్ ఇంట‌ర్య్వూలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.

తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. దీపావ‌ళికి ముందే పొంగులేటి పొలిటికల్ బాంబ్ పేల్చారు.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హ‌న్ న‌ది పున‌రుజ్జీవ‌న ప‌రిస్ధితుల‌ను అధ్య‌య‌నం చేయ‌డానికి వెళ్లిన మంత్రి పొంగులేటి అక్క‌డ ఓ తెలుగు జాతీయ ఛాన‌ల్ ప్ర‌తినిధికి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి వంటి సుమారు 8 నుంచి 10 ప్ర‌ధాన పాయింట్ల‌లో ఈ చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. దీనికి సంబంధించి ఫైళ్లు పూర్తి సాక్ష్యాధారాల‌తో సిద్ధ‌మ‌య్యాయ‌ని మంత్రి పొంగులేటి వివ‌రించారు. సియోల్ నుంచి మ‌రో 2 రోజుల్లో హైద‌రాబాద్ చేరేస‌రిక‌ల్లా చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. కేవ‌లం క‌క్ష సాధింపులా ఈ చర్యలు ఉండవని చెప్పారు. పూర్తిగా ఆధారాల‌తో చ‌ర్య‌లు ఉంటాయ‌ని, ఎంత‌టివారినైనా ఉపేక్షించేదిలేద‌న్నారు. తొంద‌ర‌ప‌డి  ఎటువంటి ఆధారాలు లేకుండా వెళ్ల‌బోమ‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచార‌ణ దాదాపు పూర్త‌యిందని మొత్తానికి  ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి  వంటి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయ‌ని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్ర‌జ‌లు ఇంత‌వ‌ర‌కు ఎటువంటి చ‌ర్య‌లు లేవ‌ని భావించ‌వ‌ద్ద‌ని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాల‌తో ముఖ్యంగా ఫైళ్లు సాయంతో ముందుకు వెళ్ల‌బోతున్నామని మంత్రి చెప్పారు.

Popular Articles