Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

గవర్నర్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

తనను కావాలనే అవమానిస్తున్నారని తెలంగాణా గవర్నర్ తమిళి సై ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గవర్నర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, గవర్నర్ వ్యవస్థతో తమకు పంచాయితీ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. నరసింహన్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన కాలంలో ప్రభుత్వానికి ఇటువంటి సమస్యలు రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

గవర్నర్ అంటే తమకెంతో గౌరవమని, ఆమెను తామెక్కడా అవమానించలేదని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యేందుకు రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, తమిళిసై బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా పని చేశారని, ఆమె గవర్నర్‌ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డురాలేదా? అని ప్రశ్నించారు. గవర్నర్‌ మాట్లాడే ముందే ఆలోచించుకోవాలని అన్నారు.

Popular Articles