Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఎంఐఎం నేత తుపాకీ కాల్పులు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలోని తాటిగూడ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ తన లైసెన్సుడ్ రివాల్వర్ తో కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. ఈ కాల్పుల్లో జమీర్, మన్నన్, మోతేషాలు అనే వ్యక్తులు గాయపడగా, చికిత్స కోసం వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఫారూఖ్ అహ్మద్ కాల్పులు జరపడానికి ముందు ఆయనపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు అతని ఇంటికి వచ్చారని మరో భిన్న కథనం వినిపిస్తోంది. కత్తులు, తల్వార్లతో తనపై దాడికి దిగిన వ్యక్తులపై ఫారూఖ్ అహ్మద్ కాల్పులు జరిపినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాగా ఘటనానంతనరం ఫారూఖ్ అహ్మద్ పరారీ అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Popular Articles