Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

బేస్ క్యాంపుపై నక్సల్స్ దాడి

పొరుగున గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ నక్సలైట్లు పోలీస్ బేస్ క్యాంపుపై దాడికి దిగారు. సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువ్వర్తి బేస్ క్యాంపుపై మావోయిస్టు నక్సల్స్ గత అర్ధరాత్రి దాటాక విరుచుపడినట్లు సమాచారం. రాకెట్ లాంఛర్లతో భీకర దాడికి పాల్పడిన మావోల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. బేస్ క్యాంపులోని పోలీసులు నక్సల్స్ దాడిని తిప్పికొట్టారు. దాదాపు 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులతో, రాకెట్ లాంఛర్లతో దాడికి పాల్పడిన నక్సల్స్ చర్యను పోలీసు బలగాలు సమర్థంగా తిప్పికొట్టడంతో మావోయిస్టులు వెనుకంజ వేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు వర్గాలు చెప్పాయి.

Popular Articles