Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

తెలంగాణాలో పేలిన మందుపాతర

తెలంగాణాలో మావోయిస్టు నక్సలైట్లు మందుపాతరను పేల్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పగిడివాగు కల్వర్టు సమీపాన ఆదివారం అర్ధరాత్రి సమయంలో నక్సల్స్ ఈ చర్యకు పాల్పడ్డారు. పేలుడు ధాటికి, శబ్దానికి చర్ల ఏజెన్సీ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శక్తివంతమైన మందుపాతర ధాటికి ఎనిమిది అడుగుల వెడల్పు, ఐదు అడుగుల లోతున గొయ్యి ఏర్పడింది.

మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ గన్ మెన్ శంకర్ ఎన్కౌంటర్ కు నిరసనగా నక్సలైట్లు నిన్న ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ రోజునే పొద్దుపోయాక నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో శంకర్ ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన ప్రకటన ప్రతులను వదిలారు.

అయితే ఎటువంటి లక్ష్యం లేకుండానే నక్సలైట్లు భారీ మందుపాతరను పేల్చిన ఘటన వాళ్ల ఉనికిని చాటుకునే చర్యగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Popular Articles