ఆసిఫాబాద్: మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి పోలీసులకు లొంగిపోయారు. దేవ్ జీ సహా మొత్తం 16 మంది మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ ఆసిఫాబాద్ పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణా పోలీసులు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి సహా లొంగిపోయిన నక్సల్స్ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

