Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఏసీబీ వలలో లేబర్ ఆఫీసర్

మధిర: ఖమ్మం జిల్లా మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్నె చందర్ సోమవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. ఓ భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి వచ్చే రూ. 1.30 లక్షల ఇన్సూరెన్స్ మొత్తానికి సంబంధించిన బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ లంచాన్ని ఆశించాడు. రూ. 15 వేలు ఇస్తేనే బిల్లు పాస్ చేస్తానని చెప్పడంతో, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఆ భవన నిర్మాణ కార్మికుని భార్య అందుకు అంగకరించకుండా ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.

అయితే లంచంగా కోరిన డబ్బు రూ. 15 వేల మొత్తాన్ని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఖమ్మం రోడ్డులో గల మధిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఫిర్యాదుదారు నుంచి నడిరోడ్డుపై తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్నె చందర్ నుంచి రూ. 15 వేల లంచం మొత్తాన్ని రికవరీ చేసి, అతని అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

Popular Articles