మేడారం: మేడారం మహాజాతర ప్రాంతం జనమయమైంది. బుధవారం సాయంత్రం సారలమ్మ తల్లి గద్దెనెక్కడానికి ముందే లక్షలాది మందితో మేడారం కిటకిటలాడుతోంది. పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చిన సమ్మక్క తల్లి భక్తులతో జంపన్న వాగు కుంభమేళాను తలపిస్తూ మహాద్భుత దృశ్యంగా మారింది. మరికొద్ది గంటల్లో సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి మేడారానికి చేరుకుని తన గద్దెపైకి చేరుకోనుంది. సారలమ్మ గద్దెపై ఆసీనమయ్యే అద్భుత ఘట్టం కోసం లక్షలాది మంది భక్తులు ఊరట్టం క్రాస్ రోడ్ నుంచి మేడారం వరకు వేచి చూస్తున్నారు.
మేడారం మహాజాతరలో బుధవారం నాటి తాజా దృశ్యాలు ఇవీ:







