Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

కరోనాతో ఖమ్మం టీఆర్ఎస్ నేత మృతి

కరోనా మహమ్మారి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడిని బలి తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, టీఎస్ ఐడీసీ మాజీ చైర్మెన్ బుడాన్ బేగ్ కరోనాతో పోరాడుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు. బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. బేగ్ మృతిపట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బుడాన్ బేగ్ మరణం బాధాకరమని, టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారని, కార్యకర్త నుండి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని కొనియాడారు.

Popular Articles