హైదరాబాద్: సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెడీ అయ్యారు. ఈమేరకు ఎర్రవల్లిలోని తన ఫాం హౌజ్ నుంచి బయలుదేరిన కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం కోసమే కేసీఆర్ రాష్ట్ర రాజధానికి వచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికారపక్షం నిర్ణయించే ఎజెండాను బట్టి కేసీఆర్ ముందుకు వెళ్లే అవకాశమున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

