Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

ప్రముఖ ఫార్మా కంపెనీపై ఐటీ దాడులు

హైదరాబాద్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హెటిరో డ్రగ్స్ సంస్థలకు చెందిన సనత్ నగర్ లోని కార్పొరేట్ కార్యాలయంపైనేగాక, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో గల ప్రొడక్షన్ ప్లాంట్లపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి.

దాదాపు 20 టీమ్ లుగా విడిపోయిన ఐటీ అధికారుల హెటిరో డ్రగ్స్ సంస్థలకు చెందిన సీఈవో, డైరెక్టర్ల ఇళ్లల్లోనేగాక, ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. దిగ్గజ ఫార్మా కంపెనీగా ప్రాచుర్యం పొందిన హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ శాఖ దాడులు చర్చనీయాంశంగా మారాయి.

Popular Articles