Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

చెక్ పోస్టులో పోలీస్ కమిషనర్ తనిఖీ

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెక్ పోస్టులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో చెక్ పోస్టుల్లో పోలీసుల పనితీరును పరిశీలించే ప్రక్రియలో భాగంగా కామేపల్లి మండలం కొత్త లింగాల వద్ద గల చెక్ పోస్టును పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించారు.

ఈ సందర్భంగా సీపీ అక్కడ విధుల్లో గల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు.

ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారుల సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెట్టి పూర్తిస్థాయిలో నిర్మూలించాలని సూచించారు. జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యం స్దానం, అలాంటి ఉల్లంఘన, అక్రమాలపై కేసులు నమోదు చేయాలని సీపీ సునీల్ దత్ అన్నారు.

Popular Articles