Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

కరోనాతో మాజీ మంత్రి మృతి

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పి. మాణిక్యాలరావు కరోనాతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. దాదాపు మూడు వారాల క్రితం కరోనా బారిన పడిన మాణిక్యాలరావు తొలుత ఏలూరులోని కోవిడ్ చికిత్సా ఆసుపత్రిలో చేరారు. అయితే శ్వాస సంబంధిత సమస్య ఏర్పడడంతో వారం రోజుల క్రితం ఆయనను విజయవాడలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న మాణిక్యాలరావు ఆరోగ్య పరిస్థితి కొద్దిసేపటి క్రితం విషమించి కన్ను మూశారు. చంద్రబాబునాయుడి మంత్రివర్గంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

ఇదిలా ఉండగా కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతూ గత నెల నాలుగో తేదీన ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలకు వీడియో సందేశం కూడా ఇచ్చారు. అందరికీ జాగ్రత్తలు చెప్పిన మాణిక్యలరావును కరోనా కబలించడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగాయి. మాణిక్యాలరావు ఇచ్చిన వీడియో సందేశాన్ని దిగువన చూడవచ్చు.

Popular Articles