Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజర్, చౌకీదార్

అటవీ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని కొమరారం ఫారెస్ట్ రేంజ ర్ ఉదయ్ కిరణ్, ఫారెస్ట్ గార్డ్ (చౌకీదార్) నూనావత్ హరిలాల్ ఓ కాంట్రాక్టరు నుంచి రూ. 30 వేల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ తన సిబ్బందితో దాడి చేసి పట్లుకున్నారు. అటవీ భూమి నుంచి మట్టి తవ్వుకునేందుకు ఓ వ్యక్తి నుంచి ఈ ఇద్దరు అటవీ అధికారులు ఆయా మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి తమ వలకు పట్టుబడినట్లు ఏసీబీ వర్గాలు చెప్పాయి.

Popular Articles