ఖమ్మం: ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగూడెం డివిజనల్ మేనేజర్ తాటి శ్రీశ్రావణిని అవినీతి నిరోధక శాఖ శనివారం అరెస్ట్ చేసింది. గత జనవరి 3వ తదీన నమోదైన లంచం కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఆమెను విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ వద్ద అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపర్చారు. ఈ కేసులో ఇప్పటికే ప్లాంట్ మేనేజర్ రాజేందర్ ను, అతనికి సహకరించిన గోపాలక్రిష్ణ అనే వ్యక్తిని ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.

