Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

చేసింది చెప్పుకోలేకే ఇబ్బంది: డిప్యూటీ సీఎం భట్టి

మధిర: కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూపోతే ఈ దేశంలో ఇంకో పార్టీ పుట్టేదే కాదని, మరో పార్టీకి భవిష్యత్తు ఉండేది కాదని తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ, ఇతర పార్టీలు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన రూ. ఐదు లక్షల పనిని మైకు దొరికిన ప్రతీసారి చెప్పుకుంటూ పోతారని, కానీ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారంలో వెనుకంజలో ఉండటం మూలంగా ఇబ్బంది ఏర్పడుతోందని అన్నారు. మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిర పట్టణానికి వచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రతి నాయకుడు రోజు పదిమందికి వివరిస్తే చాలని భట్టి సూచించారు.

మధిర పట్టణం అభివృద్ధి చెందాలి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటేనే భవిష్యత్తు తరాలు బాగుపడతాయని ఆలోచించే వ్యక్తులను గెలిపించుకోవాలని డిప్యూటీ సీఎం కోరారు. మధిర పట్టణానికి కాంగ్రెస్ చేయని పని అంటూ లేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్తు, చెరువులను టూరిజం పార్కులుగా తీర్చిదిద్దడం, డిగ్రీ, ఇంటర్, హై స్కూల్ విద్యాసంస్థలకు సొంత భవనాలు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్, ఐటిఐని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గా మార్చడం, బస్టాండ్, ట్రెజరీ, బ్యాంకులను తీసుకురావడం వంటి గొప్ప పనులు చేశామని, ఇవి మున్సిపాలిటీలోని ఓటర్లకు వివరించాల్సిన అవసరం ఉందని భట్టి పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు అభివృద్ధి పనులు జరిగితేనే మధిర పట్టణం అభివృద్ధి చెందుతుందని, తద్వారా భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందని వివరించారు.

Popular Articles