హైదరాబాద్: ఓ హోటల్ ఎదురుగా నిలిపిన ఆటోలో రెండు మృతదేహాలు కనిపించిన ఘటన హైదరాబాద్ మహానగరంలో కలకలం రేపింది. చాంద్రాయణగుట్టలోని రోమన్ హోటల్ ఎదురుగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆటోలో విగత జీవులుగా పడి ఉన్న ఇద్దరు వ్యక్తులను జహంగీర్, ఇర్ఫాన్ లు గా గుర్తించారు. ఇద్దరూ పాతికేళ్ల వయస్సులోపే ఉండడం గమనార్హం.

ఈ ఇద్దరు యువకుల మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. స్టెరాయిడ్స్ ఓవర్ డోస్ తీసుకోవడంతోనే మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థంలో మూడు సిరంజీలు కూడా లభ్యమయ్యాయని తెలుస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు ఘటనా స్థలిలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

